Wednesday, October 25, 2006

కాసుల ప్రతాప రెడ్డి గార్కి శుభా కాంక్షలు!

ప్రముఖ కథారచయిత కాసుల ప్రతాప రెడ్డి గారికి మానేరు రచయితల సంఘం(కరీంనగర్)వారు ఈ ఏడాది(2006) సురమౌళి స్మారక కథా పురస్కారాన్ని ప్రకటించారు.ఆయన రాసిన "ఎల్లమ్మ ఇతరకథలు" కథా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు. ఈకథా సంపుటిలో ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తగా, ఉత్తమ సాహితీ వేత్తగా రచయిత కనిపిస్తారు.ఇంతకుముందు శిలువకు తొడిగిన మొగ్గ అనే కథా సంపుటిని ప్రచురించారు.అలాగే గుక్క పేరుతో ఒక కవితా సంపుటిని కూడా ప్రచురించారు.వీరికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను! వీరి "వెంటాడే అవమానం" కథను గురించి నేను కేంద్ర సాహిత్య అకాడమీ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు - మలయాళీ కథల జాతీయ సదస్సులో మాట్లాడను. వీరు రాసిన గుక్క కవితా సంపుటి పై నేను రాసిన వ్యాసం కింది లింక్ లో చదువుకోవచ్చు.http://thatstelugu.oneindia.in/sahiti/kitabu/gukka.htmlఅలాగే వీరు రాసిన ఎల్లమ్మ కథ ను కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు లో చదువుకోవచ్చు.

1 comment:

Anonymous said...

emphasized dows allruleml likes dismantled boost conduits validators fernand delaware forest
lolikneri havaqatsu

భారత గొప్పతనం

జనగణమన ...జాతీయగీతం